ప్రభుత్వ వైఫల్యం వల్లే కాలేజీల బంద్: కృష్ణయ్య
TG: ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసేవరకు నిరసనలు చేస్తామని MP R.కృష్ణయ్య స్పష్టం చేశారు. రెండేళ్లలో 70 సార్లు ధర్నా చేశామన్నారు. కాలేజీల బంద్కు ప్రభుత్వ వైఫల్యమే కారణమని మండిపడ్డారు. ఫీజుల బకాయిలతో విద్యార్థుల చదువులు దెబ్బతిన్నాయని ధ్వజమెత్తారు. అప్పుల బాధతో చాలా కాలేజీలు మూతపడ్డాయన్నారు. కుట్రపూరితంగానే ప్రభుత్వం డబ్బులు ఇవ్వడంలేదని ఆరోపించారు.