పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి: కమీషనర్
MDK: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన-ప్రత్యేక ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం నర్సాపూర్ మున్సిపాలిటీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు వార్డులలో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు చెత్తను శుభ్రం చేశారు. అనంతరం స్వచ్ఛ మున్సిపాలిటీ కోసం ప్రతిజ్ఞ చేశారు. మున్సిపల్ కమీషనర్, పాలకవర్గం పాల్గొని పరిసరాలను బాధ్యతతో శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.