ప్రభుత్వ పాఠశాలకు రూ. 1.40 కోట్ల నిధులు
సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్ల వేతనాలకు సంబంధించి రూ. 1.40 కోట్ల నిధులు విడుదల చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. 1210 పాఠశాలలో పనిచేసే స్కావెంజర్లకు జూలై, ఆగస్టు నెల వేతనాలు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. నిధులు నేరుగా అమ్మ ఆదర్శ పాఠశాల ఖాతాలో జమ చేసినట్లు చెప్పారు.