వాడపల్లి వెంకన్న అన్నదాన పథకానికి భారీ విరాళం
కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో అమలు చేస్తున్న నిత్య అన్నదానం ట్రస్ట్కు మంగళవారం నిడదవోలు మండలం, పురుషోత్తపల్లి వాస్తవ్యులు సిరాపురపు కాశీ విశ్వనాధ్ వారి కుటుంబ సభ్యులు రూ. 1,61,123 విరాళం అందించారు. ఈ విరాళాన్ని ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావుకు అందజేశారు. ఆయన దాత కుటుంబానికి స్వామివారి చిత్రపటం ప్రసాదాలు అందజేశారు.