'శతశాతం ఇంటి పన్నుల వసూళ్లకు దృష్టి సారించాలి'
VZM: శత శాతం ఇంటి పన్నులు వసూలు చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలని పంచాయతీ కార్యదర్శులకు భోగాపురం డిప్యూటీ MPDO గాయత్రి సూచించారు. గురువారం ముంజేరు గ్రామ పంచాయతీని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయ రికార్డులను పరిశీలించి, ఇళ్ల పన్నులు ఎంత మేరకు వసూలు జరిగిందని అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల అసెస్మెంట్ నంబర్లు ఎంత మేరకు వేసారంటూ ఆరా తీశారు.