ఎస్పీ కార్యాలయంలో 52 ఫిర్యాదులు

SKLM: ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. సోమవారం శ్రీకాకుళం లోని తన కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 52 ఫిర్యాదులు అందాయి. వీటిపై సంబంధిత అధికారుల నుండి వివరణ తీసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకువాలని అధికారులను ఆదేశించారు.