చలి పంజా.. ఆ జిల్లాలకు 'ఎల్లో' అలర్ట్

చలి పంజా.. ఆ జిల్లాలకు 'ఎల్లో' అలర్ట్

TG: రాష్ట్రంలో చలి వణికిస్తోంది. సాయంత్రం 5 దాటితే జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. రాబోయే 2, 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు పడిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపు ఆదిలాబాద్, వరంగల్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి సహా పలు జిల్లాల్లో చలిగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది.