డ్యాన్స్ చేసిన మంత్రి పొన్నం
SDPT: హుస్నాబాద్లోని బంజారా భవన్లో ఇవాళ గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని గిరిజనులతో కలిసి భోగ్ భండర్ పూజలు నిర్వహించారు. అనంతరం వారితో కలిసి సాంప్రదాయ నృత్యాల్లో పాల్గొని ఉత్సాహాన్ని పంచుకున్నారు.