'బీసీలకే డీసీసీ అధ్యక్ష పదవులు ఇవ్వాలి'
మహబూబ్నగర్ జిల్లాలో బీసీలకే బీసీసీ అధ్యక్ష పదవులు ఇవ్వాలని బీసీ సమాజ్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ సాగర్ అన్నారు. మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వనపర్తి నాగర్ కర్నూల్ మినహా మిగతా మహబూబ్నగర్, నారాయణపేట, గద్వాలలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే అధ్యక్షులుగా ఉన్నారన్నారు. బీసీలను డీసీసీలుగా నియమించి న్యాయం చేయలన్నారు.