'కులాల పేరుతో రాజకీయాలు సహించం'
VSP: కులాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నాలను సహించబోమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆరేటి మహేష్ అన్నారు. వైసీపీ పాలనలో కాపులు, దళితులు, బీసీలకు న్యాయం జరగలేదని విమర్శించారు. ప్రజా సమస్యలపై మాట్లాడలేక కులాలను ప్రస్తావిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని గుడివాడ అమర్పై వ్యాఖ్యానించారు.