రైలు ఢీకొని 30 గొర్రెలు మృతి
ATP: డి.హీరేమల్ మండలంలో రైలు ఢీకొని 30 గొర్రెలు మృతి చెందాయి. హోసగుడ్డ గ్రామ సమీపంలో మేత కోసం వెళ్లిన గొర్రెలు.. పట్టాలు దాటుతుండగా గుంతకల్ నుంచి చిక్కజజూర్ వెళ్లే రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. మరికొన్ని గొర్రెలకు గాయాలయ్యాయి. రూ. 3 లక్షల నష్టం వాటిల్లినట్లు కాపరి ముక్కన్న వాపోయారు.