ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి

MLG: మంగపేట(M) కమలాపురం గ్రామానికి చెందిన శ్రీనివాస్ కుటుంబం శిథిల ఇంట్లో నివసిస్తోంది. ఆరుగురు సభ్యుల ఈ కుటుంబం వర్షం పడితే నీళ్లు ఇంట్లోకి చేరే సమస్యను ఎదుర్కొంటోంది. గ్రీవెన్స్లో మూడుసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఇందిరమ్మ ఇల్లు కేటాయింపుకు అర్హతలు ఉన్నాయని, ఎంక్వయిరీ చేసి ఇల్లు మంజూరు చేయాలని వేడుకున్నారు.