మే 3వరకు పెన్షన్ల పంపిణీ

NLG: జిల్లాలో ఆసరా పింఛన్లను మే 3వరకు పంపిణీ చేయనున్నట్లు డీఆర్డీఓ శేఖర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత, ఒంటరి మహిళల, చేయూత పింఛన్లను ఆయా పోస్టాఫీసుల్లో ఆందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పింఛన్ మొత్తం నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ నుంచి పొందాలని సూచించారు.