రైజింగ్ అంటే ఏంటో వాళ్లకు చూపిస్తాం: భట్టి
TG: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో విజన్ డాక్యుమెంట్ను ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. 2047కి రాష్ట్రం ఎలా ఉండాలనేదే లక్ష్యం అని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు రియల్ ఎస్టేట్ దగ్గరే ఆగిపోయాయన్నారు. తాము వాళ్ల ఆలోచనలను దాటి ముందుకు వెళ్లామని అన్నారు. రైజింగ్ అంటే ఏంటో వాళ్లకు తమ డాక్యుమెంట్ చూసిన తర్వాత తెలుస్తుందని వెల్లడించారు.