'డ్రోన్లు ఎగరడంపై చర్యలు తీసుకోవాలి'
ASR: అరకు, అనంతగిరి, హుకుంపేట మండలాల్లోని లోతేరు, వేంగడ, మజ్జివలస, పట్టాం ఏరియాల్లో రాత్రి పూట డ్రోన్లు ఎగరడం ఆదివాసులను భయ పెడుతుందని గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలదేవ్ అన్నారు. కలెక్టర్, ఎస్పీ తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని శుక్రవారం అరకులో డిమాండ్ చేశారు. రాత్రి పూట డ్రోన్లు ఎగరుతున్నాయని ఇటీవల పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు.