తలారి రంగయ్యను అభినందించిన వైఎస్ జగన్
ATP: మాజీ ఎంపీ తలారి రంగయ్య తాడేపల్లిలో బుధవారం మాజీ సీఎం జగన్ను కలిశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఆర్డీటీ సంస్థకు FCRA పునరుద్ధరణ కోసం చేపట్టిన 'లక్ష పోస్ట్కార్డుల ఉద్యమం' గురించి జగన్కు వివరించారు. రంగయ్య పోరాటాన్ని జగన్ మనస్ఫూర్తిగా అభినందించారు. ప్రజా పక్షపాతిగా నిరంతరం శ్రమించాలని రంగయ్యకు సూచించారు.