అర్ధరాత్రి కలకలం.. భయాందోళనలో ప్రజలు
AP: విశాఖపట్నంలోని గవర జగ్గయ్యపాలెంలోని రైల్వే అండర్పాస్లో అర్ధరాత్రి నైట్రోజన్ ట్యాంకర్ ఇరుక్కుంది. ట్యాంకర్ నిండా వేల లీటర్ల నైట్రోజన్ ఉండటంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. అధికారులు సేఫ్గా ట్యాంకర్ను తొలగించారు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. 3 గంటలపాటు సబ్బవరం-షీలానగర్ రూట్ను బ్లాక్ చేశారు.