చింతలపూడిలో అంబేద్కర్ వర్ధంతి
E.G: చింతలపూడిలో శనివారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని కూటమి నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు బోడ అనీష్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ చరిత్రలో భారత రాజ్యాంగానికి అత్యంత ప్రాధాన్యత ఉందని, రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలన్నారు.