పుట్టపర్తికి చేరుకున్న మంత్రి నారా లోకేష్
సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం రాత్రి పుట్టపర్తి ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని, టీడీపీ జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, తదితర నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రశాంతి నిలయానికి బయలుదేరి వెళ్లారు.