'ఆస్పత్రిలోని సమస్యలు పరిష్కరించాలి'

యాదాద్రి: ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రిలోని సమస్యలను పరిష్కరించాలని, సీపీఎం జిల్లా కార్యదర్శి సభ్యుడు కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సీపీఎం జిల్లా పోరుబాటలో భాగంగా ఆస్పత్రిలోని సమస్యలపై సర్వే నిర్వహించారు. అనంతరం సమస్యలు పరిష్కరించాలని ఆస్పత్రి ముందు ధర్నా నిర్వహించారు.