మల్కాజిగిరిలో కవిత పర్యటన
MDCL: జాగృతి జనం బాటలో భాగంగా మల్కాజిగిరి నియోజకవర్గంలో జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించారు. ఈ సందర్భంగా వినాయక్ నగర్ డివిజన్లోని వాజ్పేయి నగర్ రైల్వే క్రాసింగ్ వద్ద ప్రజల సమస్య అడిగి తెలుసుకున్నారు. అనంతరం బండ చెరువును సందర్శించారు. కవిత మాట్లాడుతూ.. జాగృతి జనం బాట ముఖ్య ఉద్దేశం ప్రజల సమస్యలను ప్రభుత్వా దృష్టికి తీసుకెళ్లడమేనన్నారు.