అనంతపురంలో పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు
ATP: జిల్లాలో గురువారం ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. బయాలజీ, మ్యాథ్స్, జూలజీ సబ్జెక్టులకు జరిగిన ఈ పరీక్షల్లో జనరల్ విభాగంలో 5,277 మంది, ఒకేషనల్ విభాగంలో 2,123 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 383 మంది గైర్హాజరైనట్లు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి వెంకటరమణ నాయక్ తెలిపారు.