VIDEO 'పంచాయతీకి రూ.10.15 లక్షల ఆదాయం'
అన్నమయ్య: నిమ్మనపల్లి పంచాయతీకి వారపు సంత గేటు వేలంపాట ద్వారా రూ.10.15 లక్షల ఆదాయం సమకూరినట్లు డీపీవో రాధ తెలిపారు. మంగళవారం జరిగిన వేలంలో చింతపర్తికి చెందిన హేమంత్ కుమార్ రెడ్డి అత్యధికంగా రూ.10.15 లక్షలకు హక్కులు దక్కించుకోగా, ఉమర్ రూ.10.10 లక్షలతో రెండో స్థానంలో నిలిచారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆదాయం గణనీయంగా పెరగడం విశేషం.