నగరంలో మరో విషాదం.. ఇద్దరు మృతి

HYD: నగరంలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. బండ్లగూడలో కరెంట్ షాక్కు గురై ఇద్దరు మృతి చెందారు. వినాయక చవితి సందర్భంగా వినాయకుడి విగ్రహాన్ని తరలించే నేపథ్యంతో ఈ ఘటన జరిగింది. ఇంకా ప్రమాదానికి సంబధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, నిన్న రామంతాపూర్లో నిర్వహించిన శ్రీ కృష్ణ శోభాయాత్రలో విద్యుత్ షాక్తో ఐదుగురు మరణించిన విషయం తెలిసిందే.