అమరావతికి గ్రీన్ సిగ్నల్.. పల్లె నివాసంలో వేడుకలు
సత్యసాయి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పార్లమెంట్ ఆమోదముద్ర లభించిన సందర్భంగా పుట్టపర్తిలో సంబరాలు అంబరాన్నంటాయి. ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తమ నివాసంలో దీపాలు వెలిగించి సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిన చారిత్రాత్మక రోజని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.