పెసలు- మినుము కొనుగోలుకు అనుమతి: జేసీ
ELR: పెసలు క్వింటా రూ.8,768, మినుములు రూ.7,800 కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ శనివారం తెలిపారు. పెదపాడు, ఏలూరు, దెందులూరు, ముదినేపల్లి, మండవల్లి, కైకలూరు, కలిదిండి మండలాల్లో ఈ-పంట నమోదు చేసుకున్న రైతుల నుంచి కొనుగోలు చేస్తామన్నారు. ఇందుకు సమీపంలోని RS కేంద్రాల్లో ఇప్పటి నుంచి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.