పుదుచ్చేరి ఎల్జీ నివాసంలోకి అక్రమంగా ప్రవేశం
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్(LG) కైలాష్ నాథన్ భవనంలోకి ఓ విద్యార్థి అక్రమంగా ప్రవేశించడం కలకలం రేపింది. జార్ఖండ్కు చెందిన హృతిక్ స్నేహితులతో కలిసి పుదుచ్చేరి వెళ్లాడు. అయితే అతను మద్యం మత్తులో LG నివాసంలోకి వెళ్లి రాత్రంతా అతిథి గృహంలో నిద్రించాడు. ఉదయాన్ని సిబ్బంది చూసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు నిందితుడిని జైలుకు తరలించారు.