వచ్చేనెల 2 నుంచి ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు

వచ్చేనెల 2 నుంచి ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు

KMM: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యాన 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి పదో తరగతి, ఇంటర్‌లో ప్రవేశాల ప్రక్రియ వచ్చేనెల 2న మొదలవుతుందని డీఈఓ సోమశేఖరశర్మ తెలిపారు. దూర విద్యా విధానంలో చదివేందుకు ఆసక్తి ఉన్న అభ్యాసకులు వచ్చేనెల 2 నుంచి11 వరకు సెంటర్లు కలిగిన ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని సూచించారు.