బాధ్యతలు స్వీకరించిన PACS పాలకవర్గం
AKP: రాంబిల్లి PACS ఛైర్మన్ ఎరిపిల్లి చిట్టిబాబు, డైరెక్టర్లు నానాజీ, ధూళి రమణ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎలమంచిలి నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రైతుల సంక్షేమంతో పాటు సొసైటీ అభివృద్ధికి పాలకవర్గం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు లాలం భారత్ పాల్గొన్నారు.