'రజక కుటుంబంపై దాడి చేసిన నిందితులను శిక్షించాలి'
MHBD: నాగర్ కర్నూల్ మండలం కుమ్మేర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై దాడి చేసి, రెండు నెలల పసికందు మృతికి కారకులైన అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని రజక సంఘం జిల్లా కార్యదర్శి పున్నం సారయ్య డిమాండ్ చేశారు. మల్లన్న దర్శనం కోసం వెళ్లిన చాకలి చంద్రకళ కుటుంబాన్ని అడ్డుకోవడం సభ్య సమాజం తలదించుకోవలసిన విషయమని మండిపడ్డారు.