జిల్లాలో పెరిగిన చలి తీవ్రత

జిల్లాలో పెరిగిన చలి తీవ్రత

MBNR: జిల్లాలో గడచిన 24 గంటల్లో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. బాలానగర్ మండలంలోని ఉడిత్యాలలో 11.4°C అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కాగా, రాజాపూర్ 11.7°C, గండీడ్ మండలం సల్కర్ పేట 11.8°C, మిడ్జిల్ మండలం దోనూరు 12.2°C, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 12.6°C, భూత్పూర్ 13.0°C, మిడ్జిల్ మండలం కొత్తపల్లి 13.3°C, కోయిలకొండ మండలం పారుపల్లి 13.4°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.