పదో పరీక్షలు ముగింపు.. 6 నుంచి పేపర్ల మూల్యాంకనం
GNTR: పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. మార్చి 16 నుంచి సాగిన పరీక్షలకు సుమారు 27 వేల మంది హాజరయ్యారు. రంజాన్ కారణంగా వాయిదా పడిన ఆంగ్ల పరీక్ష చివరిగా నిర్వహించారు. పరీక్షలు ముగియగానే విద్యార్థులు ఆనందంగా బయటకు వచ్చారు. ఎలాంటి అక్రమాలు నమోదు కాలేదు. స్క్వాడ్లు నిరంతరం పర్యవేక్షణ చేశారు. కాగా, ఈ నెల 6 నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమవుతుంది.