పాలకొల్లులో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన
W.G: కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు ఎల్ఆర్ పేటలో రూ.4.28 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వ వైఫల్యాల వల్లే ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని, కేవలం 11 స్థానాలకే పరిమితం చేశారని ఈ సందర్భంగా మంత్రి విమర్శించారు.