తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

TPT: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కంపార్ట్మెంట్లన్ని నిండి నారాయణగిరి షెడ్స్‌లోనూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న 90,802 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 40,343 తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న హుండీ ఆదాయం రూ. 3.73కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.