ఎన్నికల ప్రచారంలో కాపు సీతాలక్ష్మి
BDK: బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన రుద్రంపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గుమ్మడి దివ్యను గెలిపించాలని కొత్తగూడెం మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి పిలుపునిచ్చారు. గురువారం రుద్రంపూర్ గ్రామపంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రచారం చేపట్టారు. ఆమె మాట్లాడుతూ.. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు.