రూ.500 కోట్లు ఇవ్వండి.. పవన్కు మంత్రి వినతి
AP: మన్యం జిల్లాలో రోడ్ల అభివృద్దికి రూ.500 కోట్లు కేటాయించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను మంత్రి సంధ్యారాణి కోరారు. అల్లూరి జిల్లాకు నిధులతో డోలీ మోతలు తగ్గే పరిస్థితి నెలకొందన్నారు. అయితే మంత్రి వినతిపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. వినతిపత్రాన్ని పరిశీలించిన తర్వాత తన నిర్ణయాన్ని తెలియజేస్తానని చెప్పినట్లు సమాచారం.