'అఖండ-2' నుంచి పవర్ ఫుల్ టీజర్
'గాడ్ ఆఫ్ మాసెస్' బాలకృష్ణ నటించిన 'అఖండ-2' ఫీవర్ మరోసారి మొదలైంది. ఈ నెల 12న సినిమా విడుదల కానుంది. మేకర్స్ ప్రమోషన్స్లో భాగంగా తాజాగా థియేట్రికల్ టీజర్ను విడుదల చేశారు. 'ఎవడ్రా నిప్పుల కొండను ఆపేది' అంటూ వచ్చిన ఈ టీజర్ పూర్తి యాక్షన్తో ఫ్యాన్స్కు పూనకాలు తెప్పిస్తోంది. ఈ సినిమాలో సంయుక్తా మేనన్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.