BYPOLL: కాసేపట్లో పోలింగ్ ప్రారంభం
TG: రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ఉత్కంఠకు తెరలేపిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక చివరి దశకు చేరుకుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 407 పోలింగ్ స్టేషన్లలో 4 లక్షల మందికిపైగా ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం సీఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షించనున్నారు.