తిరుమల హుండీలో చెల్లని డబ్బులు
TPT: తిరుమలలోని శ్రీవారి హుండీకి భక్తులు చెల్లని నోట్లు సమర్పించడం సమస్యగా మారింది. డిమానిటైజేషన్ సమయంలో రద్దయిన రూ.500, రూ.1000 నోట్లు ఇప్పటికీ హుండీలో కనిపిస్తున్నాయి. ఈ రద్దు నోట్ల విలువ సుమారు రూ.400 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. రద్దయిన రూ.2000 నోట్లు కూడా ప్రతి నెల సుమారు రూ.35 లక్షల వరకు హుండీలో సమర్పించబడుతున్నాయని టీటీడీ అధికారులు తెలిపారు.