పంత్కు హర్షా భోగ్లే కీలక సూచనలు
LSG కెప్టెన్ రిషభ్ పంత్కు ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే కీలక సూచనలు చేశారు. పంత్ ఒత్తిడిని పక్కన పెట్టి, తనదైన శైలిలో స్వేచ్ఛగా ఆడాలని ఆయన సూచించాడు. 'పంత్ కొత్తగా నిరూపించుకోవాలనే ప్రయత్నాన్ని మానుకొని నీ నేచురల్ గేమ్ ఆడు. పాత పంత్ కనుక మళ్ళీ క్రీజులోకి వస్తే, ఈ సీజన్లో 150కి పైగా స్ట్రైక్ రేట్తో 500కు పైగా పరుగులు ఆశించవచ్చు' అని భోగ్లే పేర్కొన్నాడు.