'సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

NLG: వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రభలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని NLG మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ అన్నారు. గురువారం NLG లోని AR నగర్లో విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన కాలనీలో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. మురికి నీరు ఉంటే దోమలు పెరిగే అవకాశం ఉందన్నారు. నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు.