సత్తెనపల్లి పట్టణం 8వ వార్డులో సమీక్షా సమావేశం
PLD: సత్తెనపల్లి పట్టణం 8వ వార్డులో ముఖ్య నాయకులు, సచివాలయ అధికారులతో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రజలు తీసుకువచ్చిన గృహ, పెన్షన్ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు.