పాక్ దాడులు.. 400 మంది మృతి!
అఫ్గానిస్తాన్లో పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. కాబుల్లోని ఓ ఆసుపత్రిపై దాడి చేయడంతో 400 మంది మృతిచెందినట్లు అఫ్గాన్ వెల్లడించింది. ఈ ఆసుపత్రిలో డ్రగ్స్కు బానిసైన వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే, అఫ్గాన్ వ్యాఖ్యలను పాక్ ఖండించింది. ఆ దేశ పౌరులపై తాము ఎలాంటి దాడులు చేయలేదని తెలిపింది. ఆసుపత్రులను తాము లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేసింది.