సీఈసీపై పార్లమెంట్లో అభిశంసన అస్త్రం
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్లో అభిశంసన నోటీసులు సమర్పించారు. ఉభయ సభల్లోనూ ఈ నోటీసులు అందజేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. లోక్సభకు చెందిన 130 మంది, రాజ్యసభకు చెందిన 63 మంది ఎంపీలు ఈ నోటీసులపై సంతకాలు చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది.