VIDEO: పుష్కర ఘాట్ను పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్
NZB: కందకుర్తి పుష్కర ఘాట్లో 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పీ.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం సందర్శించారు. రెంజల్ మండలంలోని ఈ ప్రధాన ఘాట్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కాగా, వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు పుష్కరాలు జరగనున్నయి.