నేడు జాతీయ లోక్ అదాలత్

నేడు జాతీయ లోక్ అదాలత్

కృష్ణా: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. గోపి తెలిపారు. రాజీ చేయదగిన సివిల్, క్రిమినల్, చెక్ బౌన్స్, మోటార్ యాక్సిడెంట్ కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరిస్తారని ఆయన తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.