మళ్లీ పెరగనున్న బెంజ్ కార్ల ధరలు

మళ్లీ పెరగనున్న బెంజ్ కార్ల ధరలు

మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఏప్రిల్ 1 నుంచి తన కార్ల ధరలను 2% వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. రూపాయి విలువ పడిపోవడం, ఇన్‌పుట్ ఖర్చులు పెరగడమే దీనికి కారణమని కంపెనీ తెలిపింది. ఈ ఏడాది ధరలు పెరగడం ఇది రెండోసారి. ఈ పెంపుతో మోడల్‌ను బట్టి ధర రూ.89,000 నుంచి రూ. 7.33L వరకు పెరగనుంది. లగ్జరీ కార్ల ప్రియులకు ఇది షాకింగ్ న్యూస్.