వాడపల్లి వెంకన్న అన్నదాన పథకానికి విరాళం
కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిత్య అన్నదాన పథకానికి శుక్రవారం పొడగట్లపల్లి వాస్తవ్వులు కుంచనపల్లి వీర వెంకట సూర్య నారాయణ బంగారు లక్ష్మి, వారి కుటుంబ సభ్యులు రూ.81,116 విరాళం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు వారికి, స్వామివారి చిత్రం అందజేశారు.