పోట్లపహాడ్లో వాటర్ ప్లాంట్ ప్రారంభం

SRPT: కోహన్స్ లైఫ్ సైన్స్ యడవెల్లి అఖిల్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెన్పహాడ్ మండల పరిధిలోని పోట్లపహాడ్ గ్రామంలో వాటర్ ప్లాంట్ను సోమవారం రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజల దాహార్తిని తీర్చడం కోసం ఉచితంగా మినరల్ వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.