VIDEO: నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

విజయవాడ వ్యాప్తంగా లీగల్ మెట్రాలజీ, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లు జాయింట్ ఆపరేషన్ మంగళవారం నిర్వహించాయి. నగరంలోని హోటల్స్, రెస్టారెంట్స్, బేకరీలు, స్వీట్షాపులపై ఆకస్మిక తనిఖీలు చేశారు. తనిఖీల్లో కిచెన్లన్నీ కంపు కొడుతూ, పాడైపోయిన బ్రెడ్లు, సలాడ్లు, మాంసాహార పదార్థాలు లభించాయి. దీంతో పలు హోటల్స్పై కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు.